రెబ్బెన: మండలంలోని దేవులగూడ సమీపంలో గల పులికుంట వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం విగ్రహ, ధ్వజ శిఖర ప్రతిష్ఠాపన వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. రాజరాజేశ్వర స్వామి, కనకదుర్గాదేవి, లక్ష్మీగణపతి, నవగ్రహాలు, జంట నాగదేవతల విగ్రహాలను ప్రతి ష్ఠించారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు దుర్గం భరద్వాజ్, పర్కాల సాగర్గౌడ్, ఉప సర్పంచ్ వ రలక్ష్మి దుర్గారావు, మాజీ సర్పంచ్ అహాల్యాదేవి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


