కాగజ్నగర్టౌన్: పట్టణ శివారులోని చారిగాంలో గల డబు ల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతి న పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించారు. 288 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు గత ప్రభుత్వలో 99 శాతం పూర్తయ్యాయ ని, పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. అలాగే బెజ్జూర్ మండలంలో ఆదివాసీలు ఉన్నారని, సాంకేతిక సమస్యలతో ఇళ్లు మంజూరు కావడం లేదని తెలిపారు. అర్హులను ఎల్1లోకి చేర్చి ఇళ్లు మంజూరు చేసేందుకు మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.


