జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వీరయ్య బాధ్యతల స్వీకరణ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బదిలీ కాగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ఫుల్ అడిషనల్ ఇన్చార్జిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆయనను శాలువా తో సత్కరించారు. ప్రధాన న్యాయమూర్తి వీరయ్య మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతీ వారానికి ఒక రోజు బెంచ్ నడుస్తుందని, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంలో న్యాయవాదులు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, న్యాయవాదులు పాల్గొన్నారు.


