‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’ | - | Sakshi
Sakshi News home page

‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’

Oct 10 2025 5:58 AM | Updated on Oct 10 2025 5:58 AM

‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’

‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’

బెజ్జూర్‌(సిర్పూర్‌): సిర్పూర్‌ నియోజకవర్గంలో వర్గాలు లేవని, కేసీఆర్‌ వర్గం ఒకటే ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బెజ్జూర్‌ మండల కేంద్రంలో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.

కాగజ్‌నగర్‌రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. కాగజ్‌నగర్‌ మండలం కోసినిలోని ప్రాణహి త నిలయంలో గురువారం విలేకరులతో మాట్లాడా రు. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆధిపత్య వర్గాల నాయకులు కోర్టులో కేసు వేసి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా లాక్కున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ లెండుగురె శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, సలీం, మిన్హాజ్‌, వెంకటేశం, పోశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement