
పొర్లుదండాలతో నిరసన
ఆసిఫాబాద్రూరల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేసే డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. సీఐటీయూ, సంఘాల నాయకులు ప్రభాకర్, కృష్ణమచారి, వసంత్ రావు, కోటయ్య, భరత్, వర్కర్లు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.