
సాగునీరు అందేలా చర్యలు
కాగజ్నగర్ రూరల్: జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ నీరు రైతులకు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపా రు. శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జి ల్లా కాగజ్నగర్ మండలంలోని జగన్నాథ్పూ ర్ ప్రాజెక్ట్ను కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిపై దృష్టిలో ఉంచుకుని భవిష్యత్లో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రాజెక్ట్ భౌతిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈనెల 9న కేంద్ర బృందం రానున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను పరిశీలించి నివేదిక రూపొందిస్తా రని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్ట్ పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. నీటి పారుదల శాఖ ఈఈ ప్రభాకర్, డీఈలు, ఏఈలు, కాగజ్నగర్ మండల నీటి సరఫరా శాఖ డీఈలు, ఏఈలు అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.