
రైతులకు న్యాయం చేయాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: సింగరేణి గోలేటి ఓపెన్ కాస్ట్లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ గోడం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకు గురువారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, కొంతమంది రెవెన్యూ అధి కారులు కలిసి బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోతు న్న రైతులకు ఎకరానికి రూ.60 లక్షలతో పాటు కుటుంబంలో ఒకరికి సింగరేణి ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గోలేటి ఓసీపీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేసరి ఆంజనేయులుగౌడ్, దొందేరావ్, అరిగెల మధుకర్గౌడ్, భగవంత్రావ్, సదయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.