ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జూపల్లి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జూపల్లి

Jun 13 2025 7:05 AM | Updated on Jun 13 2025 7:05 AM

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జూపల్లి

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జూపల్లి

● మంత్రి వివేక్‌కు మెదక్‌ జిల్లా బాధ్యతలు ● నిజామాబాద్‌కు మంత్రి సీతక్క

కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన ధనసరి అనసూయ సీతక్కకు నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆదివా సీల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌కు సీతక్కను ఇన్‌చార్జిగా నియమించారు. పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఆమె ఉత్సాహంగానే పనిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమితో నిరాశకు గురైన ఆమె నాటి నుంచి జిల్లాపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించడం దాదాపుగా తగ్గించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చా ర్జి మంత్రిగా కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల మార్పు జరిగితే సీతక్క జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇన్‌చార్జి మంత్రుల జాబి తాతో ఆ విషయం స్పష్టమైంది. కొత్తగా రానున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపనున్నారనే దానిపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది. సీనియర్‌ మంత్రి కావడంతో జిల్లాకు మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్‌వెంకటస్వామికి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement