బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

Jun 14 2025 7:37 AM | Updated on Jun 14 2025 7:37 AM

బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

కాగజ్‌నగర్‌రూరల్‌: బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని భట్టుపల్లి జెడ్పీ హెచ్‌ఎస్‌లో చిన్నారులతో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, అధికారులతో కలిసి అక్షరాభ్యాసం చేయించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌, తెలుగు, గణితం, సైన్స్‌ విషయాలను ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా బోధిస్తామని తెలిపారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవర్చుకో వాలని, పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ను గౌరవించాలని సూచించారు. సకాలంలో ఏకరూప దుస్తులు అందించిన స్వయం సహాయక సంఘాల కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, అదనపు గ్రామీణభివృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా సైన్స్‌ అధికారి కటుకం మధుకర్‌, మండల విద్యాధికారి ప్రభాకర్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ పాఠశాలలో డీటీడీవో రమాదేవితో కలిసి శుక్రవారం విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, సీజీడీవో శకుంతల, నాయకులు శ్యాంనాయక్‌, నాగేశ్వర్‌రావు, అలీబిన్‌ పాల్గొన్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్‌ నమోదు చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్‌ నమోదు చేయించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ మండలంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు పనిచేయాలన్నారు. ఐదేళ్లు, 15 ఏళ్లు దాటినవారు ఆధార్‌ బయోమెట్రిక్‌ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు జిల్లాలోని 102 గిరిజన గ్రామాల్లో నిర్వహించే పీఎం జుగా శిబిరాల్లో ఆధార్‌ లేనివారిని గుర్తించాలని ఆదేశించారు. ఆధార్‌ నమోదు కేంద్రాలు, కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్‌లోని ఈ– డిస్ట్రిక్‌ మేనేజర్‌ గౌతమ్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ రీజియన్‌ యూఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహ్మద్‌ సౌబన్‌, డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌జోషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement