ఎవరెస్టు అధిరోహించిన ఎంజేపీ విద్యార్థినులు | - | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు అధిరోహించిన ఎంజేపీ విద్యార్థినులు

Jun 14 2025 7:37 AM | Updated on Jun 14 2025 7:37 AM

ఎవరెస్టు అధిరోహించిన ఎంజేపీ విద్యార్థినులు

ఎవరెస్టు అధిరోహించిన ఎంజేపీ విద్యార్థినులు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాబా పూర్‌ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపాల్‌ రత్నమాల శుక్రవారం తెలిపారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరా బాద్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి మొత్తం 20 మందిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. వీరిలో జిల్లాలోని ఎంజేపీ గురుకులానికి చెందిన పదో తరగతి విద్యార్థిని హిమబిందు, తొమ్మిదో తరగతి చదువుతున్న బిక్కుబాయి ఉన్నారని అన్నారు. మే 25న నేపాల్‌ వెళ్లిన విద్యార్థినులు.. 27న ఎవరెస్టు ఎక్కడం ప్రారంభించి ఈ నెల 5న శిఖరం పైకి చేరుకున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement