
బడుగులపై పిడుగులు
● ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ● పంట చేన్లలో మరణాలు, జీవాల మృత్యువాత ● అవగాహన లేక పెరుగుతున్న ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వా టిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరి గిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్ద రు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మి గుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబా లు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబా లకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. వానా కా లంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్నసమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పిడుగు అంటే..
ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశా మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి.
రూ.6లక్షలు పరిహారం
గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది.
జాగ్రత్త మరవద్దు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్లకు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్ పరికరాలు వినియోగించరాదు. సెల్ఫోన్లు, చార్జింగ్ చేయడం, ఐరన్, వాటర్ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.
చెట్ల కింద ఉండొద్దు
వర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు.
స్మార్ట్ఫోన్లలోనూ..
వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, వాట్సాప్ల్లోనూ అల ర్ట్ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్ మెటీరియలా జిక్ డిపార్ట్మెంట్)తోపాటు పిడుగు పడే ప్రాంతాల ను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపాటు ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.
ఒకే రోజు ఆరుగురు
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు.