
పంట మార్పిడితో అధిక దిగుబడి
కాగజ్నగర్రూరల్: పంట మార్పిడి పద్ధతి పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చని ఎమ్మెల్యే హరీశ్బాబు అన్నా రు. కాగజ్నగర్ మండలంలోని వంజీరి రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి వి జ్ఞాన కేంద్రం బెల్లంపల్లి, వ్యవసాయ శాఖ ఆ ధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్ ముగింపు సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులు శాసీ్త్రయ ప ద్ధతిలో పంటలు పండించాలన్నారు. మోతా దుకు మించి యూరియా వాడొద్దన్నారు. ఎ రువులు, విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో బిల్లులు తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం బె ల్లంపల్లి కోఆర్డినేటర్ కోట శివకృష్ణ, శాస్త్రవేత్త నాగరాజు, మండల వ్యవసాయాధికారి రామకృష్ణ, ఏఈవోలు శైలేష్, సృజన పాల్గొన్నారు.