
కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు
రెబ్బెన: సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబయ్యాయి. మండలంలోని గంగాపూర్, నేర్పల్లి, పుంజుమేరగూడ, పులికుంట కాలనీల్లోని బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. శుద్ధజలం కోసం ఆర్వో ప్లాంట్లను సైతం సమకూర్చారు. మన ఊరు– మన బడి పథకంలో భాగంగా గంగాపూర్, పుంజుమేరగూడ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, బ్యాక్బోర్డుల స్థానంలో గ్రీన్బోర్డులు, తరగతి గదుల్లో పూర్తి స్థాయి లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గంగాపూర్ పాఠశాలలో సుమారు 153 మంది విద్యార్థులు ఉండగా, నేర్పల్లిలో 30 మంది, పుంజుమేరగూడలో 41 మంది చదువుతున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదులు, పరిసరాలు శుభ్రం చేస్తున్నారు.

కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు