
చదువుల గుడి.. సావర్ఖేడా
కెరమెరి(ఆసిఫాబాద్): జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన కెరమెరి మండలంలోని సావర్ఖేడా ప్రాథమిక పాఠశాల చదువుల గుడిగా నిలుస్తోంది. గతేడాది పీఎంశ్రీ పథకానికి ఎంపిక కావడంతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ 120 మంది చదువుతున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కడేర్ల రంగయ్య ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తూ డిజిటల్ తరగుతుల, ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. 2010లో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండగా క్రమంగా ప్రవేశాలు పెరుగుతున్నాయి. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, దాతలు, ఉపాధ్యాయులు సుమారు రూ.10 లక్షల విరాళాలు అందించి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. 15 ఏళ్లలో 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో సీట్లు సాధించగా, 15 మంది హైదరాబాద్లోని చుక్కా రామయ్య విద్యా సంస్థ, పలువురు సీవోఈ, నవోదయ స్కూళ్లలో సీట్లు కై వసం చేసుకున్నారు.
ఉపాధ్యాయుల కృషి మరువలేనిది
రంగయ్య సార్తోపాటు పాఠశాలల అభివృద్ధికి పాటుపడిన ఉపాధ్యాయులు కృషి మరువలేనిది. కా ర్పొరేట్ స్థాయిలో బడిని తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్య అందిస్తున్నారు. వారికి రుణపడి ఉంటాం.
– కావుడే రమేశ్, గ్రామ పటేల్, సావర్ఖేడా