
చెట్ల కిందనే చదువు
కాగజ్నగర్టౌన్: చిన్ననాటి చదువంతా చెట్ల కిందనే కొనసాగింది. మా స్వగ్రామం కాగజ్నగర్ మండలంలోని భట్టుపల్లి. ఆ కాలంలో పాఠశాలకు సరైన వసతులు ఉండేవి కావు. ఒకటి నుంచి రెండో తరగతి వరకు రావి చెట్టు కింద, 3, 4 తరగతులు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో, 5, 6 తరగతులు పీరీల బంగ్లా, ఏడో తరగతి పంచాయతీ కార్యాలయంలో కొనసాగింది. ఉన్నత చదువుల కోసం కాగజ్నగర్కు వచ్చా. గురువులు సామల సత్యనారాయణ, బుచ్చిరాములు, చక్రపాణి సార్లు ఎంతో ప్రోత్సహించారు. చదువంటే ఉత్సాహం, పట్టుదల ఉండడంతోనే ప్రతిరోజూ హాజరయ్యే వాళ్లం. మా నాన్న భీమయ్య వృత్తిరీత్య టీచర్ కావడంతో బడికి వెళ్లడం ఆనందంగా ఉండేది.
– కటుకం మధుకర్, జిల్లా సైన్స్ అధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివా..
కాగజ్నగర్టౌన్: పెంచికల్పేట్ మండలం చేడ్వాయి ప్రాథమిక పాఠశాలలో ఒకటి తరగతి నుంచి నాలుగో తరగతి వరకు, ఐదు నుంచి పదో తరగతి వరకు జెడ్పీఎస్ఎస్(సర్సిల్క్) కాగజ్నగర్లో చదివా. ఆ తర్వాత కాగజ్నగర్లోని త్రిశూల్ పహాడ్పై ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఎస్కేఈలో డిగ్రీ పూర్తిచేశా. ఇంటి నుంచి నడుచుకుంటూ దోస్తులందరం గంట ముందే స్కూలుకు వెళ్లేవాళ్లం. సరదాగా ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్లం. రాయడం, చదవడం, లెక్కలు చేయడం ఇష్టం.
– వాసాల ప్రభాకర్,
మండల విద్యాధికారి, కాగజ్నగర్
ప్రతిభకు కొదువ లేదు
పెంచికల్పేట్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభకు కొదువలేదు. అక్కడ అందించిన నాణ్యమైన విద్యతోనే ఉన్నత చదువుల్లో రాణించా. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014లో పదో తరగతి పూర్తిచేశాను. ఇంటర్ హైదరాబాద్లో చదివి, ఎంసెట్ ద్వారా ఆదిలాబాద్ రిమ్స్లో సీటు తెచ్చుకున్నా. ఎంబీబీఎస్ పూర్తిచేశాను. కిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం పీజీ అనస్థీషియా చేస్తున్నా. – డా.సుప్రియ, పెంచికల్పేట్

చెట్ల కిందనే చదువు

చెట్ల కిందనే చదువు