తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బానోత్ పంతులు నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదివారం పరామర్శించారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న, సర్పంచ్ ఆర్మీ రవి, ఉపసర్పంచ్లు చందు, చామకూరి రాజు, నాయకులు దేవేందర్రెడ్డి, మంచానాయక్, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


