అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి

Sep 13 2025 6:07 AM | Updated on Sep 13 2025 6:07 AM

అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి

అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి

సత్తుపల్లిరూరల్‌: పంటలకు అవసరం మేరకే నత్రజని ఎరువు వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, తుంబూరు, గంగారం పీఏసీఎస్‌ల్లో యూరి యా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పంటలకు కొంత మొత్తంలో నానో యూరియా, నానో డీఏపీలను పిచికారీ చేస్తే ఇక్కట్లు ఉండవని తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నందున ఎక్కడా కొరత లేదని వెల్లడించారు. అనంతరం కిష్టారం, బేతుపల్లిల్లో పంటల నమోదు ప్రక్రియను డీఏఓ తనిఖీ చేశారు. సత్తుపల్లి ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌హెచ్‌ఓ టి.శ్రీహరి, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు డి.నరేష్‌, టి.సాయివాసంతి, కె.ఆశాజ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement