ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య

Sep 7 2025 7:50 AM | Updated on Sep 7 2025 7:50 AM

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య

కూసుమంచి: మండలంలోని చౌటపల్లికి చెందిన నూకల సాయి కుమార్‌ (23)ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆయన శుక్రవారం పురుగులమందు తాగగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆర్థికసమస్యల కారణంగానే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి మల్లయ్య ఇచ్చి న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమ విఫలమైన యువకుడు..

కూసుమంచి: మండలంలోని మునిగేపల్లికి చెందిన తుపాకుల సిద్ధూ (25) శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఆమె నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సిద్ధూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తండ్రి హుస్సేన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

కుక్కల దాడిలో

లేగదూడ మృతి

నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారంలో కుక్కలుదాడి చేయగా లేగ దూడ మృతి చెందింది.గ్రామానికి చెంది న రైతు తెల్లగొర్ల అనిల్‌ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈక్రమాన కుక్కల గంపు దాడిచేసి దూడనుఈడ్చుకెళ్లి దాడి చేయడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement