డబ్బులు ఇస్తేనే ‘సదరమ్‌’ | - | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇస్తేనే ‘సదరమ్‌’

Sep 5 2025 5:28 AM | Updated on Sep 5 2025 5:28 AM

డబ్బు

డబ్బులు ఇస్తేనే ‘సదరమ్‌’

8లో

న్యూస్‌రీల్‌

విద్యార్థుల్లో స్ఫూర్తి కోసమే

సూటు బూటు

టీచర్ల భుజాలపైనే పిల్లల భవిష్యత్‌

అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ

అంకితభావం.. ఆదర్శం

దివ్యాంగులకు సదరమ్‌ సర్టిఫికెట్ల జారీలో కొందరు సిబ్బంది డబ్బు డిమాండ్‌ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

వాతావరణ ం

జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలవుతుంది. మధ్యాహ్నానికి మరింత పెరిగి సాయంత్రం చల్లబడుతుంది.

శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

ఆత్మగౌరవానికి ప్రతీక..

ఎమ్మెల్యేగా ఖద్దరు బట్టల్లో నిత్యం కనిపిస్తున్నా ఏదైనా స్కూల్‌కు వెళ్లి విద్యార్థులను కలవాల్సి వస్తే మాత్రం కచ్చితంగా పైన కోటు ధరిస్తా. కోటుతో హుందాతనం వచ్చి ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి కష్టాలు అనుభవించినా ఆత్మగౌరవ ప్రతీకగా సూటు ధరించేవారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి చేరిన నేను విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే ఫుల్‌సూట్‌ ధరిస్తుంటా.

బియ్యంలో పురుగులు ఏరుకుని..

మాది దమ్మపేట మండలం గండుగులపల్లి. అమ్మానాన్న చుక్కమ్మ – సత్యనారాయణకు నాలుగెకరాల పొలం ఉండేది. అయినా ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడేవి. నా చదువంతా ఆశ్రమ పాఠశాలల్లోనే సాగింది. ఐదో తరగతి వరకు అంకంపాలెం, పదో తరగతి వరకు పార్కలగండి ఆశ్రమ స్కూల్‌, ఇంటర్‌ కిన్నెరసాని స్పోర్ట్స్‌ కాలేజీలో చదివా. అప్పుడు ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు ఉండేవి. ప్రతీ ఆదివారం విద్యార్థులందరం పురుగులు ఏరితే ఆ తర్వాత వారం వండిపెట్టేవారు. అలా డిగ్రీ వరకు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)గా 2005లో సున్నంబట్టి స్కూల్‌లో ఉద్యోగం సాధించా.

1998లో ప్రెసిడెంట్‌ మెడల్‌..

హైస్కూల్‌ స్థాయి నుంచి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో పాల్గొంటుండగా 1998లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి(వరల్డ్‌ జంబోరి) పోటీల్లో 48 దేశాలు పోటీపడగా భారత్‌ నుంచి ఎనిమిది మందిమి ప్రాతినిధ్యం వహించాం. అందులో నాకు ‘ఏ’ గ్రేడ్‌ రావడంతో అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్‌.నారాయణ్‌ చేతుల మీదుగా ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నా. అప్పటి నుంచే క్రమశిక్షణ, సమయ పాలన, సామాజిక బాధ్యతలు అలవాటయ్యాయి. ఇంటర్‌లో రన్నింగ్‌, జావెలిన్‌త్రో, హైజంప్‌ బాగా చేసేవాడిని. మ్యాథ్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసినా లెక్కల టీచర్‌గా కంటే విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే పీఈటీగా పనిచేసేందుకే మొగ్గు చూపాను.

జీతంలో కొంత..

ఆశ్రమ పాఠశాలలో చదివే పిల్లలు ఓసారి ఇంటికి వెళ్తే మళ్లీ రావడానికి మొండికేస్తారు. అలా బడి మానేసిన విద్యార్థుల ఇళ్లకు సైకిల్‌పై వెళ్లి అవసరమైతే ఆరోజు అక్కడే ఉండి వారిని తిరిగి తీసుకొచ్చేవాడిని. ఆ పిల్లల కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి బాధేసేది. అలాంటి పిల్లల కోసం నా జీతంలో కొంత మొత్తం ఖర్చు చేసేవాడిని కూడా. అలా చేర్పించిన పిల్లలు ఇప్పుడు చదువులో రాణిస్తుండటం చూస్తే సంతోషంగా ఉంటుంది.

రాజకీయ ప్రస్థానం..

మా మేనమామ ముత్యాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఆయన ప్రోద్బలంతో 2014లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున అశ్వారావుపేట నుంచి పోటీ చేశా. ఆ సమయాన చుట్టూ కార్యకర్తలే ఉండేవారు. కానీ ఓడిపోయాక కేడర్‌ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నానని హేళన చేసేవారు. ఇది చాలదన్నట్టు ఆ ఎన్నికల్లో నాపై నెగ్గిన తాటి వెంకటేశ్వర్లు సైతం బీఆర్‌ఎస్‌లో చేరగా 2019 ఎన్నికల్లో టికెట్‌ ఆయనకే వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీలో నేను మూడో స్థానానికి పడిపోయి పలకరించేవారు కరువయ్యారు.

రూ.5కోట్లు విద్యారంగానికే..

స్కౌట్స్‌లో పని చేయడం వల్ల చిన్నప్పటి నుంచి అలవడిన క్రమశిక్షణ, సమయపాలన నాకు అండగా నిలిచాయి. కష్టాలు ఎదురైనా నీరుగారిపోకుండా లక్ష్యం వైపు నడిచేలా దోహదం చేశాయి. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక వ్యక్తి లేదా సమాజం ఎదుగుదలలో విద్య ప్రాముఖ్యత తెలిసిన వాడిని కాబట్టే ఎమ్మెల్యే కోటాలో వచ్చిన రూ.10 కోట్ల నిధుల్లో రూ. 5 కోట్లు విద్య మీదనే ఖర్చు పెట్టాను. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నా. ఇదే సమయాన పిల్లల భవిష్యత్‌ కోసం పాటుపడాలని ఉపాధ్యాయులకు సూచిస్తుంటా. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ. అందుకే విద్యా పరిమాణాలు ఉద్యాన రైతులకు చేరువ చేసేందుకు హార్టికల్చరల్‌ యూనివర్సిటీని అశ్వారావుపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.

ఎమ్మెల్యే సార్‌!

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పిల్లలకు ఆరంభంలోనే క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తే వారి జీవితాల్లో వెలుగు రేఖలు వచ్చి పేదరికం తొలగిపోతుందని అంటున్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. పూర్వాశ్రమంలో ప్రభుత్వ పీఈటీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం

ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. నేడు(శుక్రవారం) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థిగా,

ఉపాధ్యాయుడిగా, ఎమ్మెల్యేగా తన అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

ఆ వివరాలు ఆదినారాయణ మాటల్లోనే..

డబ్బులు ఇస్తేనే ‘సదరమ్‌’
1
1/1

డబ్బులు ఇస్తేనే ‘సదరమ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement