
ఎన్ఏపీఈ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వరర
ఖమ్మంగాంధీచౌక్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్ఏపీఈ) తెలంగాణ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పమ్మి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. భద్రాచలంలో ఇటీవల నిర్వహించిన అసోసియేషన్ ద్వైవార్షిక మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఖమ్మం ట్రంక్ రోడ్డు సబ్ పోస్ట్మాస్టర్ వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా, కొత్తగూడెంనకు చెందిన ఆర్.సంతోష్ సర్కిల్ అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని అసోసియేషన్ ఖమ్మం డివిజన్ ప్రతినిధులు సీహెచ్ కామేశ్వరరావు, బి.హుస్సేన్, బి.వీరన్న, సీహెచ్ఎస్వీబీ కుమార్, ఎ. రాంప్రసాద్ తదితరులు అభినందించారు.
ఆన్లైన్ రుణం పేరిట బురిడీ
నేలకొండపల్లి: తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామనే ప్రకటన నమ్మిన ఓ యువకుడు మోసపోయాడు. నేలకొండపల్లికి చెందిన ఓ యువకుడికి యాప్ ద్వారా రూ.2 లక్షల రుణం వస్తుందని మెసేజ్ వచ్చింది. తొలుత చార్జీల కింద రూ.4,500 చెల్లించాలని చెప్పడంతో అవి చెల్లించాడు. ఆ తర్వాత రుణం మంజూరైందంటూ రూ.9,500 జీఎస్టీ చెల్లించాలని చెప్పడంతో యువకుడు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. దీంతో యువకుడు మోసపోయినట్లు గ్రహించి తెలిసిన వారికి చెప్పుకుని వాపోయాడు.
పాలేరు వాసికి డాక్టరేట్
కూసుమంచి: మండలంలోని పాలేరుకు చెందిన అనంతుల మహేశ్గౌడ్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. బయ్యారం ప్రాంతంలోని ఇనుప ధాతువుపై ప్రొఫెసర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్ను గ్రామస్తులు అభినందించారు.
మొబైల్ యూనిట్ను
పరిశీలించిన డీఎంహెచ్ఓ
సత్తుపల్లి: మండలంలోని చంద్రాయపాలెంలో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన కంటైనర్ మొ బైల్ మెడికల్ యూనిట్ను డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి బుధవారం పరిశీలించారు. ఈ క్యాంప్ ద్వారా అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసిన ఆమె సిబ్బందికి సూచనలు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.సీతారాం, మెడికల్ ఆఫీసర్ ఆర్.అవినాష్, సూపర్వైజర్లు శారారాణి, వెంకటేశ్వ రరావు పాల్గొన్నారు.
పీహెచ్సీల్లో నూరు శాతం వైద్యసేవలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని పీహెచ్సీల్లో నూరుశాతం వైద్యసేవలు అందించాలనిడీఎంహె చ్ఓ కళావతిబాయి ఆదేశించారు. కలెక్టరేట్లో బు ధవారం ఆమె ఖమ్మం డివిజన్లోని పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కొన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో ఇమ్యూనైజేషన్, ప్రసవాల్లో వెనకబడినందున తీరు మా ర్చుకోవాలని సూచించారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్, ప్రో గ్రాం ఆఫీసర్ రామారావు, డెమో సుబ్రహ్మణ్యం, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, ఎన్హెచ్ఎం డీపీఓ దుర్గ, నాగరాజు, రవితేజ, కృష్ణమోహన్ పాల్గొన్నారు.

ఎన్ఏపీఈ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వరర

ఎన్ఏపీఈ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వరర