
కలెక్టర్ను కలిసిన ఉద్యోగ సంఘాల బాధ్యులు
ఖమ్మం సహకారనగర్: కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యాన టీజీవోస్, టీఎన్జీవోస్ బాధ్యులు కలిశారు. కలెక్టరేట్లో సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదన శ్రీని వాస్, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులుగా నాగిరెడ్డి
ఖమ్మం సహకారనగర్: టీపీటీఎఫ్ వెలువరించే ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా పి.నాగిరెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. గతంలో నాగిరెడ్డి టీపీటీఎఫ్ మండల, జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసందర్భంగా ఆయనకు టీపీటీఎఫ్ నాయకులు మనోహర్రాజు, రామారావు, ఎస్.విజయ్ అభినందనలు తెలిపారు.
ఐఎఫ్ఎస్గా ఎంపికై న యువకుడికి సన్మానం
వైరారూరల్: మండలంలోని రెబ్బవరం గ్రా మానికి చెందిన చరణ్తేజ ఇటీవల విడుదలైన యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో 231 ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్గా ఎంపికయ్యా డు. ఈ సందర్భంగా ఆయనను సోమవారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులు, స్థానికులు సన్మానించారు. అనంతరం చరణ్తేజ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేలా శ్రమించాలని సూ చించారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ హెచ్ఎం గంగవరపు వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పబ్లిక్ స్కూళ్ల పేరుతో
విలీనం సరికాదు
ఎర్రుపాలెం: పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుచేస్తామంటూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం గర్హనీయమని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు పేర్కొన్నారు. విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేలా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం పీఆర్టీ యూ సభ్యత నమోదు ప్రచారం చేశారు. ఈసందర్భంగా రంగారావు మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తోందని తెలిపారు. పీఆర్టీయూ మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మదన్మోహన్రెడ్డి, ఎం.బాబురావుతో పాటు ఆర్.బ్రహ్మారెడ్డి,జంగాగురునాధరెడ్డి, శెట్టిపల్లి సం గిరెడ్డి, డి.లింగయ్య, లక్ష్మారెడ్డి, అప్పిరెడ్డి, శ్రీని వాసరెడ్డి, వెంకటనారాయణ, నర్సింహారా వు, రాఘవరావు, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు.
ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేది
అశ్వారావుపేట: ఉమ్మడి జిల్లాలోని అశ్వారావు పేట, సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూచించింది. ఈ రెండు నర్సరీల ద్వారా ఇచ్చిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో రూ.లక్షల్లో నష్టపోయామని పలువురు రైతులు ఎస్టీ కమిషన్కు ఇటటీవల ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ విచారణ చేపట్టారు. ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో పాటు బాధిత రైతులు హాజరవగా 2016 – 2022 మధ్యలో పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై సమగ్ర నివేదిక నెలలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ విచారణకు ఉద్యానశాఖ కమిషనర్ యాష్మిన్ బాషా, ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య, ఓఎస్డీ అడప కిరణ్, ప్రవీణ్రెడ్డితో పాటు జిల్లా రైతులు కారం శ్రీరాములు, మడివి బాలరాజు, కొండ్రు మురళి, చెలికాని వెంకట్, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

కలెక్టర్ను కలిసిన ఉద్యోగ సంఘాల బాధ్యులు