పెద్దాస్పత్రిలో లీకేజీలు | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో లీకేజీలు

Jun 25 2025 1:27 AM | Updated on Jun 25 2025 1:27 AM

పెద్ద

పెద్దాస్పత్రిలో లీకేజీలు

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో పలుచోట్ల పైపుల నుండి నీరు లీక్‌ అవుతోంది. వేతనాలు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. పైపుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి పలు వార్డుల్లో నీరు లీకేజీ అవుతోంది.

కేవీకే కోఆర్డినేటర్‌

రవికుమార్‌ బదిలీ

వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌గా నియామకం

వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె. రవికుమార్‌ బదిలీ అయ్యారు. ఆయనను భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌గా నియమించారు. అయితే, రవికుమార్‌ స్థానంలో కేవీకే కోఆర్డినేటర్‌గా ఎవరినీ నియమించలేదు. కేవీకేలో సీనియర్‌ శాస్త్రవేత్తకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

ఎస్‌బీఐ ఆధ్వర్యాన రక్తదానం

ఖమ్మంగాంధీచౌక్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్‌ రోడ్డు బ్రాంచ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్‌బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.రాజేఖర్‌ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్‌నాయక్‌, బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ ఏజీఎస్‌ షేక్‌ ఇబ్రహీం, రీజనల్‌ సెక్రటరీ ఆర్‌.శివకుమార్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉదయ్‌, స్టాఫ్‌ యూనియన్‌ వైస్‌ ప్రసిడెంట్‌ నందన్‌, రీజనల్‌ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గొర్రెలు, గుర్రాల చోరీకి యత్నం

ముదిగొండ: మహబూబ్‌నగర్‌నుంచిమేత కోసం జీవాలను తీసుకురాగా, వాటిని చోరీ చేసేం దుకు దుండగులు యత్నించిన ఘటన ఇది. వివరాలి లా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పెంపకందారులు మేత కోసం తీసుకురాగా, మండలంలోని బాణాపురంలో ఓ రైతు పొలంలో సో మవారం రాత్రి నిద్రించారు. ఈక్రమాన టాటా ఏస్‌ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు పెంపకందారుల వెంట ఉన్న రెండుగుర్రాలతో పాటు గొర్రెల చోరీకి యత్నించారు. గొర్రెల కాళ్లకు తాళ్లు కట్టి వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా కాపలాదారులు నిద్రలేచారు. దీంతో కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆపై టాటా ఏస్‌ వాహనాన్ని కాపలాదారులు ద్విచక్రవాహనంపై వెంబడించి వల్లభి వద్ద అడ్డుకున్నా రు. దీంతో డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పరారు కాగా మంగళవారం పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో

పాడిగేదెలు మృతి

కారేపల్లి: తెగి పడిన విద్యుత్‌ తీగలను తాకడంతో రెండు పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. కారేపల్లికి చెందిన రైతు ఇమ్మడి సీతారాములు తన రెండు పాడిగేదెలను సోమవారం మేతకు వదలగా సుబ్బయ్యకుంట చెరువు సమీపానికి వెళ్లాయి. అయితే, రాత్రి గేదెలు రాకపోవటంతో రైతు కుటుంబం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, సుబ్బయ్యకుంటకు కాస్త దూరాన విద్యుత్‌ తీగలు తెగిపడి ఉండటం, వీటిని తాకిన పాడిగేదెలు మృతి చెందినట్లు మంగళవారం గుర్తించిన స్థానికులు సీతారాములుకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం గాలివానకు తీగలు తెగిపడి ఉంటాయని, మేతకు వెళ్లిన గేదెలు వాటిని తాకి మృత్యువాత పడ్డాయని భావిస్తున్నారు.

వైన్స్‌ వద్ద ఘర్షణ, కత్తిపోట్లు

ఖమ్మంఅర్బన్‌: వైన్స్‌ వద్ద మందుబాబుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఖమ్మం విజయ డెయిరీ ఎదురుగా ఉన్న వైన్స్‌ వద్ద ఇందిరానగర్‌కు చెందిన మనీశ్‌ వైన్స్‌ వద్ద మద్యం సేవిస్తూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో టేకులపల్లి లక్ష్మీనగర్‌కు చెందిన మేడరాజుల వెంకటేశ్వర్లు ఇదేమిటని ప్రశ్నించగా వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. ఈక్రమంలోనే మనీష్‌కు ఆయన స్నేహితులు తోడై వెంకటేశ్వర్లుపై దాడి చేశారు. ఆపై వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మనీష్‌పై దాడి చేయగా ఆయన మెడపై తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వెంకటేశ్వర్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కాగా, ఈ గొడవతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.

పెద్దాస్పత్రిలో లీకేజీలు1
1/1

పెద్దాస్పత్రిలో లీకేజీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement