
మున్సిపాలిటీల్లో పదోన్నతులు, బదిలీలు
● కేఎంసీ ఏఎంసీగా అనిల్కుమార్ ● మధిర, వైరా కమిషనర్లకు పూర్తిస్థాయి పోస్టింగ్
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు ఉద్యోగులను బదిలీచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ ము న్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ జె. అనిల్కుమార్కు పదోన్నతి కల్పించి కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు. అంతేకాకుండా మధిర, వైరా కమిషనర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఏ.సంపత్కుమార్, సీహెచ్.వేణును అక్కడే పూర్తి స్థాయి కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. గ్రేడ్–3 కమిషనర్గా పదోన్నతి పొందిన బి.నాగరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కమిషనర్గా నియమించారు. అంతేకాక పలు మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. కొత్తగూడెంలో పనిచేస్తున్న జె.సుజితకు కేఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా, ఇల్లెందులో పనిచేస్తున్న బి.సుధీర్కు వైరాలో, కేఎంసీలో పనిచేస్తున్న డి.నాగరాజుకు కొత్తగూడెం కార్పొరేషన్లో, సత్తుపల్లిలో పనిచేస్తున్న బి.రామచంద్రుకు కేఎంసీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, ఇల్లెందులో పనిచేస్తున్న ఎం.వీరకుమారి, మధిరలో పనిచేస్తున్న ఆర్.నాగలక్ష్మి, కొత్తగూడెంలో పనిచేస్తున్న మూడ్ అశోక్, పి.సరస్వతికి పాత కేంద్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వగా, మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న కే.పీ.దిలీప్కుమార్ను సత్తుపల్లి సీని యర్ అసిస్టెంట్గా నియమించారు.