
గంజాయి రవాణాలో యువతులు
ఖమ్మంక్రైం: పోలీసులు, ప్రయాణికులకు అనుమానం రాకుండా అమ్మాయిలతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణా చేయిస్తునట్లు తేలింది. గంజాయి రవాణా సమాచారంతో ఎక్సైజ్ ఏఈఎస్ తిరుపతి ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక యువకుడు, ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగ్ల్లో పరిశీ లించగా రూ.2.50లక్షల విలువైన గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి గంజాయితో బయలుదేరిన వారు బస్సులు మారుకుంటూ ఖమ్మం చేరుకుని, బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుభకర్మండల్, కాజల్మండల్, శుశు లిశిల్గా గుర్తించిన ్సజ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీహరిరావుతో పాటు ఉద్యోగులు కరీం, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్కుమార్, ఉపేందర్, వీరబాబు, స్వరూప పాల్గొన్నారు.
ఖమ్మం కొత్త బస్టాండ్లో పట్టుబడిన నిందితులు