
అంతరపంటలతో అదనపు ఆదాయం
● నాటడానికి ఇదే సరైన అదును ● విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు, శుద్ధి తప్పనిసరి ● మధిర ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి సలహాలు, సూచనలు
మధిర: వానాకాలం సీజన్లో పెద్దసంఖ్యలో రైతులు అపరాల పంటలు సాగు చేస్తారు. ఇందులో పెసర, మిను ము, కంది ప్రధానంగా నిలుస్తున్నా యి. పప్పు ధాన్యాల సాగుతో భూసా రం పెరుగుతుంది. అంతేకాక ప్రధాన పంటగా పత్తిలో అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మేరకు అపరాల సాగుకు విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలను మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రుక్మిణీదేవి వెల్లడించారు.
అనువైన రకాలు
మినుము: ఎంబీజీ –207, ఎంబీజీ– 1070, డబ్ల్యూబీజీ– 26, పీయూ– 31, ఎల్ బీజీ– 752, ఎల్ బీజీ –787, టీబీజీ–104, జీబీజీ– 11.
పెసర: ఎంజీజీ–95, ఎంజీజీ –385, ఎంజీజీ–348, ఎంజీజీ– 347, డబ్ల్యూజీజీ –42, డబ్ల్యూజీజీ –37, టీఎమ్– 96–2, వీపీఎమ్–2–14.
నేల తయారీ, విత్తనశుద్ధి
మినుము, పెరస సాగుకు జూన్ 1 నుంచి జూలై 15 వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెసర హెక్టార్కు 15–16 కిలోలు, మినుము 18–20కిలోల విత్తనాలు అవమసరమవుతాయి. ము రుగునీరు వెళ్లే వసతితో పాటు తేమను నిలుపుకోగలిగిన భూ ములు ఈ పంటల సాగుకు అనుకూలం. చౌడు భూములు పని కి రావు. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో హె క్టార్కు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఎరువులను హె క్టార్కు వేసి కలియదున్నాలి. ఆపై కిలోవిత్తనాలను 3 గ్రా ముల థైరమ్ లేదా కాప్టాన్ లేదా మ్యాంకోజబ్ మందుతో శుద్ధి చేశాక 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5 మి.ల్లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధిచేసుకోవాలి. ఆపై విత్తేముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10కిలోల విత్తనానికి పట్టిస్తే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
కంది : అనువైన రకాలు, జాగ్రత్తలు
కంది సాగు చేసే రైతులు ఎంఆర్జీ–1004, ఐసీపీఎల్ –87119, పీఆర్ జీ–176, పీఆర్ జీ– 158, ఐసీపీ– 8863, డబ్ల్యూఆర్ జీ –121, డబ్ల్యూఆర్ జీ– 65, టీడీఆర్ జీ–4, డబ్ల్యు ఆర్ జీ–93, డబ్ల్యూఆర్ జీ– 255, టీడీఆర్ జీ–59 రకాలను ఎంచుకోవచ్చు. వెర్రి తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఎల్ఆర్ జీ–105, టీఆర్ జీ–59, బీఎస్ఎంఆర్ –736, ఐసీపీఎల్–87119 రకాల సాగు మంచిది. అలాగే, గత పంట తాలూకు వెర్రి తెగులు సోకిన మొక్కలు, వాటి అవశేషాలను సమూలంగా నాశనం చేసేలా దుక్కులు చేయాలి. ఈ పంట సాగుకు మురుగునీరు వెళ్లే వసతిగల భూములు అనువైనవి. వేసవిలో తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో మెత్తగా దున్నాక ఆఖరి దుక్కిలో హెక్టార్కు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరముం ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నాలి. విత్తడానికి ముందు 10కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చ ర్ పట్టించాలి. విత్తనాలు వేయడానికి జూన్, జూలై మాసాలు అనువైనవి. ఆగస్టు వరకు కూడా విత్తుకునే అవకాశం ఉన్నా మొక్కలు, సాళ్ల మధ్య దూరం తగ్గించాలి. ఎకరాకు 5–6 కిలో ల విత్తనాలు అవసరమవుతాయి. ఇక కంది పైరును 40–50 రోజులవరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. మొదట రెండు నెలల వరకు తరచుగా గొర్రు /దంతి సాయంతో అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారించవచ్చు. కలుపు బెడద ఎక్కువగా ఉంటే విత్తాక 24 గంటల్లోపు ఎకరానికి 1.0– 1.4 లీటర్ల పెండిమిథాలిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయా లి. అలాగే, కందిలో అంతర పంటగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు, పత్తి లేదా పసుపు సాగు చేసుకోవచ్చు.
అంతర కృషి, సస్యరక్షణ
పెసర, మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. 20–30 రోజుల దశలో గొర్రు / దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారించడమే కాక తేమను నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో విత్తగానే 24 గంటల్లోపు ఎకరాకు 1.0–1.40 లీటర్లు పెండిమిథాలిన్ 80శాతం ఈసీ 200 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాక తొలి దశలో చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్ల దోమ, పేనుబంక, కాండపు ఈగ ఆశించే అవకాశముంది. ఇందులో కాండపు ఈగ నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా డైమిథోయేట్ 2 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా పిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ.ను లీటర్ నీటికి, తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి ఎసిటామాప్రిడ్ 0.2 గ్రాములు, పేనుబంక నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఫలితం ఉంటుంది.

అంతరపంటలతో అదనపు ఆదాయం

అంతరపంటలతో అదనపు ఆదాయం