బార్ల కేటాయింపునకు లక్కీ డ్రా | - | Sakshi
Sakshi News home page

బార్ల కేటాయింపునకు లక్కీ డ్రా

Apr 30 2025 12:21 AM | Updated on Apr 30 2025 12:21 AM

బార్ల కేటాయింపునకు లక్కీ డ్రా

బార్ల కేటాయింపునకు లక్కీ డ్రా

ఖమ్మంక్రైం: ఖమ్మంలో కొన్నేళ్ల క్రితం మూతబడిన రెండు బార్లను తిరిగి కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరించగా, మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఖరారు చేశారు. రెండు బార్ల కోసం 145 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొందరు 5నుంచి 10 దరఖాస్తులు సమర్పించారు. ఈమేరకు కలెక్టరేట్‌లో లక్కీ డ్రా ఏర్పాటుచేయగా, కలెక్టర్‌ ముజమ్మల్‌ ఖాన్‌ డ్రా తీసి పేర్లు ప్రకటించారు. జిల్లా ఆస్పత్రి సమీపంలోని ఓ హోటల్‌ బాధ్యులు నూనె అజయ్‌ పేరుతో ఒకటి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైన్స్‌ షాపుల సిండికేట్‌ బాధ్యులు లక్ష్మీనారాయణ పేరుతో ఇంకో బార్‌ దక్కించుకున్నారు. అయితే, ఏపీ వ్యాపారులు సైతం 20 దరఖాస్తులు వేసినా బార్‌ దక్కకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. మొత్తం దరఖాస్తుల ద్వారా ఎకై ్సజ్‌ రూ.1.45కోట్ల ఆదాయం సమకూరిందని, బార్లు దక్కించుకున్నవారు నగరంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుండగా ఏటా రూ.42లక్షల లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి, ఏఈఎస్‌లు వేణుగోపాల్‌రెడ్డి, తిరుపతి, సీఐలు కృష్ణ, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. డ్రా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో వీడియో కవరేజీ మధ్య పూర్తిచేశారు.

హోటల్‌, వైన్స్‌ సిండికేట్‌కు ఒక్కో బార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement