హుబ్లీలో సామూహిక నమాజ్
బెంగళూరులో మైసూరు రోడ్డులోని ఈద్గాలో ప్రార్థనల దృశ్యం
చిక్కబళ్లాపురం: ముస్లిం సోదరులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఉదయమే ఈద్గా మైదానాలకు చేరుకుని విశేష ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు బక్రీద్ ప్రాముఖ్యతను బోధించారు. చిక్కబళ్లాపురంలోని బి.బి.రోడ్డులోని పెద్ద మసీదు నుంచి ఊరేగింపు జరిపారు. ప్రశాంత నగరంలో ఉన్న ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు జరిపారు. అందరూ శుభాశయాలను చెప్పుకున్నారు. బెంగళూరులో వివిధ ఈద్గాలలో విశేష ప్రార్థనలు జరిగాయి. ప్రముఖ నగరాలు, పట్టణాలలో శాంతియుతంగా బక్రీద్ ఆచరణ సాగింది.
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు


