గ్రామీణ విద్యార్థులకు ఉచిత శిక్షణ వరం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యార్థులకు ఉచిత శిక్షణ వరం

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

హొసపేటె: ప్రతిభావంతులైన, పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ అందించడం వరంలాంటిదని ముతుగనహళ్లి కొట్రేశ్‌ తెలిపారు. తాలూకాలోని బ్యాసిగదేరి గ్రామంలో ఉన్న క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ కోచింగ్‌ సెంటర్‌ మూడో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా ఉచిత విద్య పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు నవోదయ, మొరార్జీ దేశాయి రెసిడెన్షియల్‌ స్కూల్‌, సర్వోదయ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి పాఠశాలల్లో పరీక్షలు రాయవలసి వస్తోందన్నారు. ఆ పరీక్షలకు శిక్షణను అందించి, చిన్న పిల్లలను పరీక్షకు సిద్ధం చేసే పనే ఒక సామాజిక సంస్కరణ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఫెయిర్‌ ప్రైస్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హెచ్‌ఏ కొట్రేష్‌ మాట్లాడుతూ తాము చిన్నపిల్లల మనసుల్లో ఆలోచనల బీజాలు నాటుతున్నామని అన్నారు. వారి ఆలోచనల ద్వారా వారి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఈ కోచింగ్‌ సెంటర్‌ చేస్తున్న పని గొప్పదని ఆయన అన్నారు. వెనుకబడిన కులాల సమాఖ్య అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్‌, హిరేమని నాగప్ప, బానాడ హనుమంత, కొట్రేష్‌, సంతోష్‌, నాగరాజ్‌, ఉమేష్‌, ఎస్టీఎంసీ అధ్యక్షుడు సురేష్‌, హొసమని రామన్న, హెచ్‌ అజ్జప్ప, ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఇన్‌చార్జి హొసమని మంజునాథ్‌, హేమంతప్ప, ట్రైనర్‌ కొట్రేష్‌, యూ.భరత్‌, హర్షవర్ధన్‌, సీ.మంజునాథ్‌, లైబ్రేరియన్‌ రామలింగప్ప, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement