రాయచూరు రూరల్: జిల్లాలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పిస్తూ గత జిల్లాధికారి నితీష్ చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామని జిల్లాధికారిణి పూవిత వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లాధికారి కార్యాలయంలో నితీష్ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అధికారుల విధి అని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గత జిల్లాధికారి నితీష్, అదనపు జిల్లాధికారి శివానంద పాల్గొన్నారు.
జిల్లాధికారిణిగా పూవిత
బాధ్యతల స్వీకారం
మహిళా శిశు సంక్షేమ శాఖపై
ప్రత్యేక నిఘా


