రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా స్థాయి కసాప సంస్థాపన దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. నగరంలోని కిల్లే బృహన్మఠంలో తాలూకా అధ్యక్షుడు విజయ్ రాజేంద్ర ఆధ్వర్యంలో కసాప 98వ సంస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకోని జరిగిన కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య మాట్లాడుతూ కన్నడ భాష ఎదుగుదలకు ప్రోత్సాహం అందించాలన్నారు. కన్నడ భాషలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వీర హనుమాన్, ఈరణ్ణ కోస్గి, రావుత్ రావ్, ప్రతిభ, వైశాలి, దండెప్ప బిరాదార్ తదితరులు పాల్గొన్నారు.


