తుమకూరు: కల్పతరునాడు తుమకూరు నగరంలో ఐటీఎఫ్డబ్ల్యూ–35 ర్యాంకింగ్ తుమకూరు మహిళా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి మంగళవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. తుమకూరు విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించిన టెన్నిస్ కోర్టు ఈ టోర్నీకి వేదికైంది. హోంమంత్రి జీ.పరమేశ్వర్, టోర్నీ ప్రముఖులు, జిల్లాధికారి, ఎమ్మెల్యేలు బెలూన్లను ఎగరేయడం ద్వారా నాంది పలికారు. కన్నికా పరమేశ్వర్, ఎమ్మెల్యేలు సురేష్గౌడ, జ్యోతిగణేష్, సురేష్బాబు, గోవిందరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్లలో పలువురు క్రీడాకారిణులు తలపడగా, పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.


