అధ్యక్ష స్థానం ఎన్నికపై విప్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

అధ్యక్ష స్థానం ఎన్నికపై విప్‌ జారీ

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ విప్‌ జారీ చేసింది. పట్టణ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. ఈ పదవికి బీజేపీ నుంచి సురేష్‌ బానకర్‌ పోటీ చేస్తారని మండల అధ్యక్షుడు బెణకల్లు ప్రకాష్‌ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అధ్యక్ష ఎన్నికల్లో నమ్మకంతో అందరిపై విప్‌లు జారీ చేయలేదని అన్నారు. అయితే తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇందులో మా నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ సారి పార్టీ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించే సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇబ్బందిని నివారించడానికి విప్‌ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు జోగి హనుమంతప్ప, నవీన్‌కుమార్‌, దీపక్‌ కఠారి, నాగరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement