ఎరువులు, విత్తనాల కొరత అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు, విత్తనాల కొరత అరికట్టండి

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

హొసపేటె: దేశవ్యాప్త వ్యవసాయ పరికరాలు, విక్రయదారుల సంఘం బంద్‌ పాటిస్తున్న నేపథ్యంలో విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో తమ వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కూడ్లిగి ఎరువులు, పురుగుమందులు, విత్తన విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో కూడ్లిగి తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. యూరియా సంఘం అధ్యక్షుడు కేటర్‌ నాగరాజు మాట్లాడుతూ డీఏపీ, ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా అనుసంధానించాలి. అన్ని రకాలపై ఎరువులపై ఎంఆర్‌ఓలో 8 శాతం డీలర్‌ లాభం మార్జిన్‌ ఉండాలన్నారు. అన్ని ఎరువులకు ఓటీఎల్‌ అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కూడ్లిగి ఎరువులు, పురుగుమందులు, విత్తన అమ్మకందారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎంఎం తిప్పేస్వామి, కార్యదర్శి ఏఎస్‌.మల్లికార్జున బండ్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement