రాయచూరు రూరల్: జిల్లాకు చెందిన నలుగురు తుంగభద్ర నదిలో మునిగి దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మాన్వి తాలూకా కుర్డి గ్రామానికి చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఓ వివాహానికి వెళ్లారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కుందకూరు వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు జల సమాధి అయ్యారు. మాన్వి తాలూకా కుర్డికి చెందిన దాసరి ఉమాపతి(28), దాసరి రత్నమ్మ (26), దాసరి శివానంద(20), దాసరి మహేష్(20) నదిలో సరదాగా స్నానానికి వెళ్లి లోతట్టు ప్రాంతంలోకి దిగి పోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఆ ప్రాంతంలో తెప్ప సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


