స్వచ్ఛతకు పెద్దపీట వేయాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతకు పెద్దపీట వేయాలి

Mar 25 2026 7:30 AM | Updated on Mar 25 2026 7:30 AM

రాయచూరు రూరల్‌: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని మైసూరు సిటీ కార్పొరేషన్‌ ఇంజినీర్‌ నవీన్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం నగరంలోని సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైసూరు సిటీ కార్పొరేషన్‌ స్వచ్ఛతలో దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిందన్నారు. ఈ విషయంలో మైసూరు సిటీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందాలు కుదుర్చుకొందన్నారు. అధికారులు మహదేవమ్మ, జ్యోతి, యోగేష్‌, అశ్వఽథ్‌, శివ ప్రసాద్‌, నగరసభ అధికారులు భరత్‌ కుమార్‌, సంతోష్‌ రాణి, మల్లికార్జున రెడ్డిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement