బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి ఊరట | - | Sakshi
Sakshi News home page

బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి ఊరట

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి ఊరట

బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి ఊరట

భాగ్యనగర (బాగేపల్లి): 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బాగేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డికి భారీ ఊరట లభించింది. గత ఎన్నికల్లో సుబ్బారెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ పరాజిత బీజేపీ అభ్యర్థి మునిరాజు దాఖలు చేసిన ఎన్నికల వివాద పిటిషన్‌ను సమర్థించిన హైకోర్టు ఇటీవల ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తదుపరి విచారణ తేదీని సెప్టెంబర్‌కు వాయిదా వేసింది. ప్రముఖ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, వేదవ్యాస్‌ కామత్‌ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి తరఫున కేసును వాదించారు. సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్మికులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చడమే కాకుండా, ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్‌ కార్యకర్తల సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement