వైటీపీఎస్లో యథేచ్ఛగా బొగ్గు చోరీ
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు చోరీకి గురవుతోందని, అధికారులు, ఇంజినీర్లే ప్రధాన భాగస్వాములని జయ కర్ణాటక అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ ఆరోపించారు. బుధవారం పాత్రికే యుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, యరమరస్ వరకు రైల్వే లైన్ల గుండా వ్యాగన్లతో వెళ్లే రేక్లను సగ భాగం అన్లోడ్ చేసి మిగిలిన బొగ్గును యరమరస్ రైల్వే స్టేషన్లో గంట సేపు నిలిపి బొగ్గును అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్, తెలంగాణ రామగుండం, ఒడిశా మహానది కోల్డ్ ఫీల్డ్ల నుంచి వస్తున్న బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్రశేఖర్ సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్ శేషగిరి ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించి రాష్ట్ర సర్కార్ ఖజానాకు రూ.30 కోట్ల మేర నష్టం కల్గించారన్నారు. అలాంటి అధికారులు, సబ్ కాంట్రాక్టర్, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలన్నారు. కరుణాకరరెడ్డి, విశాల్ కుమార్, ఖైసర్ హుసేనీలున్నారు.
అధికారులు, ఇంజినీర్లే ప్రధాన భాగస్వాములు
జయ కర్ణాటక అధ్యక్షుడు శివకుమార్ యాదవ్


