కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి

Oct 1 2025 11:23 AM | Updated on Oct 1 2025 11:23 AM

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి

హొసపేటె: ఏఐయూటీయూసీలో విలీనమైన కర్ణాటక రాష్ట్ర యునైటెడ్‌ హాస్టల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌, విజయనగర యూనిట్‌, జిల్లాధికారి కవిత ఎస్‌.మన్నికేరి ద్వారా ముఖ్యమంత్రి, కార్మిక మంత్రి, సాంఘీక సంక్షేమ మంత్రి, ఇతర మంత్రులకు వినతిపత్రాన్ని సమర్పించింది. ఔట్‌ సోర్సింగ్‌ రద్దు, శాశ్వత నియామకం, ఇప్పటికే నిర్ణయించిన విధంగా కార్మికుల కోసం బహుళార్ధ సాధక సహకార సంఘం ఏర్పాటు, కనీస వేతన పెంపు నోటిఫికేషన్‌ అమలు, విజయనగర జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు, ఇతర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. కర్ణాటక రాష్ట్ర జాయింట్‌ హౌసింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ కార్మిక చట్టాలను గాలికి వదిలేసి, కాంట్రాక్టర్ల బారి నుంచి వారిని విడిపించాలనే కార్మికుల నిరంతర పోరాటం డిమాండ్‌కు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో బహుళార్ధ సాధక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఆలస్యం అయిందని, వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement