
కుండపోత వర్షం.. రైతన్న అయోమయం
బీదర్ జిల్లాలో కూలిన ఓ ఇల్లు
వాన నీటిలో రోజుల తరబడి నానుతున్న పత్తి పంట
వెంకటాపూర్లో అతివృష్టితో పత్తి పంట ధ్వంసమైన దృశ్యం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో ఖరీఫ్లో వ్యవసాయంలో వరుణ దేవుడు కక్షకట్టాడు. వానలు కురిసి పంటలు నీటిలో మునిగి కుళ్లిపోతున్నాయి. చేతికొస్తున్న పంటలు పండిన జీవనోపాధికి రైతుల నోటికి మట్టి కొట్టినట్లైంది. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి ఏడాది ఏదో ఒక సాకుతో వ్యవసాయం కుదేలు కావడంతో రైతులను కదిలిస్తే కళ్లలో నీరు వస్తాయి. కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికమై వేలాది ఎకరాల్లో పంటలను పీకి వేశారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్ జిల్లాల్లో భారీ వర్షాలకు 200 ఇళ్లు కూలాయి. వేలాది ఎకరాల్లో పెసలు, మినుములు, కంది, పత్తి పంటలు నీట మునిగాయి. మరో వైపు కురిసిన వానలకు ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి.
వర్షబాధిత రైతులను
ఆదుకోవాలి
జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు ఇంద్రజిత్ డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా అకాల వర్షాలు పడినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాజకీయాలు తప్ప రైతు ప్రయెజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొని అన్నదాతలను అదుకోవాలన్నారు.
పంట నష్టం ఎదుర్కొంటున్న అన్నదాతలు
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో వ్యవసాయం కుదేలు

కుండపోత వర్షం.. రైతన్న అయోమయం

కుండపోత వర్షం.. రైతన్న అయోమయం

కుండపోత వర్షం.. రైతన్న అయోమయం

కుండపోత వర్షం.. రైతన్న అయోమయం