నవ దంపతుల ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

నవ దంపతుల ఆదర్శం

Sep 7 2025 7:17 AM | Updated on Sep 7 2025 7:17 AM

నవ దంపతుల ఆదర్శం

నవ దంపతుల ఆదర్శం

నేత్రదానానికి హామీ

మైసూరు: పదేళ్ల పాటు ప్రేమించుకున్న ఓ జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. మైసూరు నివాసి చందన్‌, లావణ్య శనివారం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గుడిలో సరళరీతిలో మనువాడారు. ఈ సందర్భంగా తామిద్దరు మరణానంతరం నేత్రదానం చేస్తామని ఓ కంటి ఆస్పత్రికి ప్రమాణపత్రం రాసిచ్చారు. చందన్‌ మాట్లాడుతూ పెళ్లి రోజున సమాజానికి కానుకగా జ్ఞాపకంగా ఉండాలని వర నటుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ చూపిన మార్గంలో నేత్రదానానికి అంగీకరించామని చెప్పారు. నవ దంపతులు అందరి ప్రశంసలకు పాత్రులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement