కంటైనర్‌– బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

కంటైనర్‌– బస్సు ఢీ

Jul 25 2025 4:51 AM | Updated on Jul 25 2025 4:51 AM

కంటైనర్‌– బస్సు ఢీ

కంటైనర్‌– బస్సు ఢీ

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో కేఆర్‌ ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొన్నాయి. సాగర్‌ తాలూకా ఆనందపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. సాగర్‌ నుంచి శివమొగ్గకు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ శివానంద నాయక, కండక్టర్‌ ఫక్కీరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో వస్తున్న స్కూలు బస్సులో బాధితులను ఆస్పత్రికి తరలించారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ,

25 మందికి గాయాలు

బనశంకరి: హాసన్‌ జిల్లాలో రెండు కేఎస్‌ ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం సకలేశపుర తాలూకా మారనహళ్లి వద్ద హైవేలో ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న బస్సు, ధర్మస్థల నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు ఢీకొన్నాయి. రెండు బస్సుల్లోని డ్రైవర్లు సహా 25 మంది ప్రయాణికులు గాయపడగా, సకలేశపుర ఆసుపత్రికి తరలించారు. బస్సుల ముందుభాగాలు ధ్వంసమయ్యాయి.

పలువురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement