
ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
రాయచూరు రూరల్ : అఖిల కర్ణాటక బ్రాహ్మణ సంఘం అద్యక్ష, సభ్యుల ఎన్నికల్లో ఉధ్యక్షుడిగా జగన్నాథ్ కులకర్ణి, సంయుక్త కార్యదర్శిగా రమేష్ కులకర్ణి నియమితులయ్యారు.
శవమై తేలిన వృద్ధురాలు
హుబ్లీ: ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు శవమై కనిపించింది. ధార్వాడ చరంతిమఠ వీధి నివాసి నీలవ్వ బసప్పవాడి(74) ఇటీవల ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చరంతిమఠ బావిలో శవమై తేలింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రైన్సహయంతో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
డాక్టరేట్ ప్రదానం
రాయచూరు రూరల్: రాయచూరు ప్రభుత్వ డీగ్రి కళాశాల అధ్యాపకురాలు ఉమ పాటిల్కు ఏపీలోని కుప్పం ద్రావిడ వర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. అర్గనైజేషన్ కల్చర్ అండ్ ఇట్స్ ఇంప్యాక్ట్ ఆన్ ఫర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయిస్ ఎక్స్టెన్సివ్ స్టడీ ఆఫ్ హట్టి గోల్డ్ మైన్స్ అనే అంశంపై కలబుర్గి విశ్రాంత అధ్యాపకుడు భీమేష్ మార్గదర్శనంలో సమర్పించిన పరిశోధన పత్రానికి డాక్టర్ట్ లభించింది.

ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

ఉపాధ్యక్షుడిగా ఎన్నిక