
ప్రభుత్వం ఆదుకోవాలి
మరో పదిహేను రోజుల్లో వరి పంట కోతకు వస్తుంది. ఈ సమయంలో భారీ వర్షాలు పడుతున్నయి. నాకున్న మూడెకరాల్లో ఏసిన పంటకు నష్టం జరిగింది. పంట నష్టపోయిన మాలాంటి రైతులను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలి.
– భూసారపు శ్రీనివాస్, రైతు, కోనరావుపేట
నాకున్న మూడెకరాల్లో ఈ సారి పత్తి పంట ఏసిన. ఏకరాపై రూ. 30వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. పత్తి పంట కాయ దశకు వచ్చింది. ఏకధాటి వానలతో వైరస్ సోకిందట. కాయలు నల్లగా, ఆకులు ఎర్రగా మారినయి.
– ఉప్పుల అనిత, రైతు, గూడెం
వాతావరణంలో వస్తున్న మార్పులు, భారీవర్షాలతోనే తెగుళ్లు ఆశిస్తున్నాయి. వాటి నివారణకు వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే పురుగు మందులు వాడాలి. ఇందుకోసం స్థానిక ఏఈవోలను తప్పకుండా సంప్రదించాలి.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి

ప్రభుత్వం ఆదుకోవాలి