సెల్యూట్‌ 108 | - | Sakshi
Sakshi News home page

సెల్యూట్‌ 108

Oct 5 2025 2:16 AM | Updated on Oct 5 2025 2:16 AM

సెల్యూట్‌ 108

సెల్యూట్‌ 108

విశ్రాంతి ఎరగని సేవకులు దసరా రోజు విధుల్లో ఈఎంటీ స్టాఫ్‌ ఒక్కరోజే 209 మందిని కాపాడిన సిబ్బంది విధుల్లో 53 మంది పైలట్లు, 53 మంది టెక్నీషియన్స్‌ అత్యవసర కేసుల్లో అత్యధికం రోడ్డు ప్రమాదాలే

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలు తుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపా డి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్‌ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రాధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథ కం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రా ణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సై తం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు.

209 కేసులు.. 150 మంది ప్రాణాలు

దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు.

లిక్కర్‌ సేల్స్‌ పెరగడం

ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్‌ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్‌ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement