ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్‌

May 14 2025 2:11 AM | Updated on May 14 2025 2:11 AM

ఇద్దర

ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్‌ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు మణిదీప్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్‌ఐ మోహన్‌, కానిస్టేబుల్‌ జీవన్‌ పాల్గొన్నారు.

వడదెబ్బతో ఒకరి మృతి

వెల్గటూర్‌: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇద్దరి మృతికి    కారణమైన వ్యక్తి అరెస్ట్‌1
1/1

ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement