
లింగనిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్వో వెంకటరమణ
కరీంనగర్టౌన్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భంలోని పిండం ఆడ లేదా మగ అని తెలియపరచడం వంటి చర్యలకు పాల్పడితే నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించి మొదటి కాన్పులు సాధారణంగా అయ్యేలా గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. సిజేరియన్ డెలివరీల పర్సంటేజ్ తగ్గించి నార్మల్ డెలివరీల పర్సంటేజీ పెంచాలని తెలిపారు. వైద్యాధికారులు సనా జవేరియా, ఉమాశ్రీ, వేణు, వసంతకుమార్, రాజగోపాల్, కై క, స్వామి పాల్గొన్నారు.