ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను జీపీ అధికారులు తుంగలో తొక్కుతున్నారని, అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ భిక్కనూర్ వాసులు మహేందర్రెడ్డి, నరేందర్ రెడ్డిలు మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదన్నారు. జీపీ కార్యదర్శి మహేశ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మరోసారి కలెక్టర్కు విన్నవించినట్లు పేర్కొన్నారు.


