కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పోచారం అభయారణ్యంలో జీవవైవిధ్యం ఉట్టిపడుతోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ అభయారణ్యంలో వేలాది వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వాటి సంరక్షణ కోసం అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. వేసవి సీజన్ మొదలవడంతో అటవీ ప్రాంతంలో సాసర్పిట్లలో నీటిని నింపుతున్నారు. వాటి రక్షణకు వివిధ చర్యలు చేపడుతున్నారు. దీంతో జింకలు, నెమళ్లు, దుప్పులు, అడవి పందులు... ఇలా వివిధ రకాల వన్యప్రాణులు అభయారణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


