జాతీయ స్థాయి అర్హత పరీక్షలో మెరిసిన సౌత్ క్యాంపస్ కెమ
భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ కెమిస్ట్రీ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన సీఎస్ఐఆర్ నెట్ అర్హత పరీక్షలో ప్రతిభను చూపి ఫెలోషిప్నకు ఎంపికయ్యారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ విభాగంలో బి.రాకేష్(అలిండియా ర్యాంక్ 98), ఎం.యోగేశ్వర్ (ఆల్ఇండియా ర్యాంక్ 128) సాధించారు. అలాగే లెక్చరర్షిప్నకు జే. మలిఖార్జున్, శ్రావికలు ఎంపికయ్యారు. ఎంపికై న ఈ విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీ, సీఎస్ఐఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే పరిశోధనల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం విద్యార్థులను కెమిస్ట్రీ విభాగం హెచ్వోడీ డాక్టర్ సాయిలు, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్గౌడ్, కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ సునీత, డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్లు అభినందించారు.
జాతీయ స్థాయి అర్హత పరీక్షలో మెరిసిన సౌత్ క్యాంపస్ కెమ
జాతీయ స్థాయి అర్హత పరీక్షలో మెరిసిన సౌత్ క్యాంపస్ కెమ
జాతీయ స్థాయి అర్హత పరీక్షలో మెరిసిన సౌత్ క్యాంపస్ కెమ


