
మహిళలకు కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలు
స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమున్న వారిని పెద్దాసుపత్రులకు సిఫారసు చేశారు. మహిళలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి పీహెచ్సీ, డోంగ్లీ పీహెచ్సీ, బాన్సువాడ మండలం హన్మాజీపేట పీహెచ్సీ, భిక్కనూరు మండలం జంగంపల్లిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
– కామారెడ్డి రూరల్/మద్నూర్/
బాన్సువాడ రూరల్/భిక్కనూరు